డోంట్ మిస్.. కొద్ది గంటల్లో అరుదైన, ఆసక్తికర అద్భుత దృశ్యం ఆవిష్కృతం

by Disha Web Desk 23 |
డోంట్ మిస్.. కొద్ది గంటల్లో అరుదైన, ఆసక్తికర అద్భుత దృశ్యం ఆవిష్కృతం
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో మంగళవారం రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం కానుంది. ఆ సమయంలో నీడ మొత్తానికే కనిపించదు. ఇది సూర్య సిద్ధాంత ప్రాతిపదికగా గణనం చేసిన సమయం. సూర్యుని క్షీణత స్థానం అక్షాంశానికి సమానంగా మారినప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది. సూర్యుడు స్థానిక మెరిడియన్‌ను దాటినప్పుడు, సూర్యకిరణాలు భూమిపై ఉన్న వస్తువుకు సంబంధించి ఖచ్చితంగా నిలువుగా పడతాయి. ఆ వస్తువు నీడ ఉండదు. అందుకే దీన్ని జీరో షాడో డే అని పిలుస్తారు. ఈ విషయాన్ని బిర్లా సైన్స్‌ సెంటర్‌ టెక్నికల్‌ అధికారులు వెల్లడించారు. ఈ వింతను భాగ్యనగర వాసులు మిస్సవకుండా.. చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read more:

వరుడి వెకిలి చేష్టలు.. తట్టుకోలేని షాకిచ్చిన వధువు

Next Story

Most Viewed